కరోనా విలాయతడo దేశంలో భారీగా పెరిగిన కేసులు

corona virus :కరోనా విలాయతడo దేశంలో భారీగా పెరిగిన కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ కేసులు క్ర‌మంగా పెరుతున్నాయి. కోవిడ్ వ్యాప్తి పెరుగుతుండ‌టంతో భ‌యాందోళ‌న‌లు అధిక‌మ‌వుతున్నాయి. దేశంలో కొత్తగా 5676 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో క‌రోనా వైర‌స్ యాక్టివ్ కేసులు 37 వేలు దాటాయ‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, ఇప్పటివరకు చాలా తక్కువ కేసులు ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి.కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, దేశంలో కరోనా కేసులు 79 శాతం పెరిగాయి. ఈ కరోనా సంఖ్య గత ఏడు నెలల్లో అత్యధికం. కరోనా కారణంగా మరణాల సంఖ్య ఇంకా తక్కువగా ఉండటం ఉపశమనం కలిగించే విషయమే అయినప్పటికీ, అది క్రమంగా పెరుగుతోంది.

తాజా నివేదిక ప్రకారం, భారతదేశంలో ఏప్రిల్ 3 నుండి 9 వరకు అంటే 6 రోజుల్లో 68 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు. కాగా గత వారంలో ఈ సంఖ్య 41గా ఉంది. దీనితో పాటు, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌తో సహా కొన్ని రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనావైరస్ కేసులు నమోదు అయ్యాయి. కేరళలో ఇప్పటివరకు 11,296 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి, ఇది గత వారం కంటే 2.4 రెట్లు ఎక్కువ. అదే సమయంలో, మహారాష్ట్రలో 4,587 కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 3896, హర్యానాలో 2140, గుజరాత్‌లో 2039 కేసులు నమోదయ్యాయి.

కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ప్రభుత్వాన్ని, ఆరోగ్య శాఖను ఆందోళనకు గురిచేస్తుంది. దేశంలోని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా అన్ని రాష్ట్రాల సమావేశాన్ని పిలిచి, కరోనా సంక్రమణ నివారణకు సంబంధించి కఠినమైన సూచనలు ఇవ్వడానికి కారణం ఇదే. కరోనా ఇంకా పోలేదని, ఏ స్థాయిలోనూ ఈ విషయంలో అలసత్వం వహించవద్దని ఆరోగ్య మంత్రి రాష్ట్రాలకు స్పష్టంగా చెప్పారు.

కరోనా ముప్పు పెరుగుతున్న దృష్ట్యా సోమవారం (ఏప్రిల్ 10) దేశవ్యాప్తంగా పలు ప్రభుత్వ, ప్ర‌యివేటు ఆసుపత్రుల ఏర్పాట్లను పరిశీలించేందుకు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించారు. ఇందులో అతిపెద్ద ఆసుపత్రి ఎల్ఎన్జేపీ కూడా ఉంది. సోమవారం నుంచి ముంబ‌యిలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు. మాక్ డ్రిల్ సందర్భంగా మంత్రులు, ఉన్నతాధికారులు ఆసుపత్రుల్లో సౌకర్యాల సన్నద్ధత, సామర్థ్యాలను సమీక్షించారు.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌ సన్నద్ధతను పరిశీలించాలని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులను కోరారు. అదే సమయంలో కోవిడ్ నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది.

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh