ఎమ్మెల్సీ కవిత కాలుకు గాయం మూడు వారాలు బెడ్ రెస్ట్

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత కాలుకు గాయం మూడు వారాలు బెడ్ రెస్ట్

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గాయపడ్డారు. అయితే ఎమ్మెల్సీ కవిత మరో మూడు వారాల పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ ఎదుట కానీ ఈడీ ఎదుట కానీ హాజరయ్యే చాన్స్ లేదు. సమన్లు ఇచ్చ్చినా సరే ఆమె హాజరు కారు.

ఎందుకంటే తన కాలుకు ఫ్రాక్చర్ అయినందున వైద్యులు మూడు వారాల పాటు బెడ్ రెస్ట్ అవసరం అని చెప్పారని ప్రకటించారు.

ఆమె ఈ విషయాన్ని కవిత సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. నేరుగా కలవలేనని సోషల్ మీడియా ఖాతా ద్వారా సాయం అవసరం అయినవాళ్లు సంప్రదించవచ్చని తెలిపారు.

మరో వైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కూడా కవిత  విచారణను ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఆమె పలు మార్లు ఈడీ ఎదుట  హాజరయ్యారు. ఆమెకు సంబంధించిన పది ఫోన్లను ఈడీ అధికారులకు అప్పగించారు. ఈ పది ఫోన్ల విశ్లేషణ తర్వాత ఆమెను మరోసారి ఈడీ అధికారులు విచారణకు పిలుస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆమె గాయపడటంతో ఆ విచారణ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఒక వేళ విచారించదల్చుకుంటే ఈడీ అధికారులు ఇంటికే వచ్చి ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసు విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని సుప్రీంకోర్టులోపిటిషన్ దాఖలు చేశారు.  ఈ పిటిషన్ పై విచారణ నెలాఖరులో జరగనుంది.

అలాగే తెలంగాణ జాగృతి కార్యాచరణలో భాగంగా మిస్డ్ కాల్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడంతోపాటు దేశంలో యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు మరియు చర్చలు నిర్వహించనున్నారు. ఈ  నెలలో ఈ కార్యక్రమాలు నిర్వహించేలా కవిత ప్రణాళిక రూపొందించారు.  మహిళా బిల్లుకు మద్దతు కోసం దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఆలోచనపరులు, మేధావులకు కల్వకుంట్ల కవిత పోస్టు కార్డులు పంపనున్నారు. మహిళలకు సాధికారత కల్పిద్దాం, దేశానికి సాధికారత కల్పిద్దాం. మహిళల రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వండనే  విధంగా క్యాంపైన్  ప్రారంబించాలనుకున్నారు. అయితే ప్రస్తుతం  మూడు వారాల పాటు  బెడ్ రెస్ట్ అవసరం కావడంతో ఈ ఉద్యమ కార్యాచరణ అంతా వాయిదా పడినట్లుగానే భావిస్తున్నారు.

అయితే ఒక వేళ సుప్రీంకోర్టులో కవితను ఇంటి దగ్గరే విచారించాలన్నట్లుగా ఆదేశాలు వస్తే ఇక కవితకు టెన్షన్ తప్పినట్లే.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh