భాగ్యనగర వాసులను వణికిస్తున్న వీధి కుక్కలు

hyderabad ghmc received

భాగ్యనగర వాసులను వణికిస్తున్న వీధి కుక్కలు

భాగ్యనగర వాసులను వీధి కుక్కలు భయం వెంటాడుతోంది. ఇటీవల అంబర్‌పేట్‌లో బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో ప్రజలు కుక్కలను చూస్తుంటేనే వెన్నులో వణుకు మొదలువుతుంది. ఈ పరిస్థితి పై తెలంగాణ  ప్రభుత్వం దుష్టి సరిస్తుంది. ప్రజలకు భరోసా ఇవ్వడానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది. దీంతో వీధి కుక్కల  పై జీహెంచ్ఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 36 గంటల్లో కంట్రోల్ రూం టోల్ ఫ్రీ నెంబర్‌కి ఏకంగా 15 వేల కంప్లైంట్స్ వచ్చాయి. గతంలో రోజుకు 30 వరకు ఫిర్యాదులు వచ్చేవని అధికారులు చెబుతున్నారు. కేవలం హైదరాబాద్‌ లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కలు విజృంభిస్తున్నాయి. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో వీధి కుక్కల దాడిలో మరో ఏడుగురు గాయపడ్డారు. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామంలో శుక్రవారం ఉదయం ఇంటి గుమ్మం వద్ద ఆడుకుంటున్న 17 నెలల పాప జర్పుల భానుశ్రీపై వీధి కుక్క దాడి చేయడంతో చిన్నారి ఎడమచేయిపై గాయమైంది.

ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో నాలుగేళ్ల బొల్లె శరీష్మ గురువారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా రెండు కుక్కలు దాడి చేయడంతో తలపై గాయాలయ్యాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీట్‌బజార్‌లో శుక్రవారం ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కుక్కలు వెంటపడ్డాయి. వాహనం అదుపు తప్పి కింద పడిన ఇద్దరిపై దాడి చేసి కాళ్లపై గాయపరిచాయిసూర్యాపేటలోని రాజీవ్‌నగర్‌లో శుక్రవారం ఉదయం పదేళ్ల బాలుడు చెర్రిపై.. వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో ఛాతీపై గాయాలయ్యాయి. గురువారం రాత్రి ఇదే కాలనీకి చెందిన 11 ఏళ్ల తరుణ్‌, పదేళ్ల షేక్‌ షాహిన్‌ వీధి కుక్కల దాడిలో గాయపడ్డారు. ఈ ఘటనల నేపథ్యంలో.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే  ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అనేక మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందని వాపోతున్నారు.  ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh