శ్రీ వారి భక్తులకు అదిరిపోయే శుభవార్త

Good news for Sri Vari devotees

Tirumala: శ్రీవారి భక్తులకు అదిరిపోయే  శుభవార్త

కలియుగ దైవం శ్రీ ఏడుకొండల వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులకు మెరుగైన సేవలు అందించే విధంగా తిరుమల దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల పుణ్యక్షేత్రంలో సామాన్య భక్తులకు అగ్ర తాంబూలం ఇచ్చేలా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుంది.

అయితే అన్నీ అనుకున్నట్లు పాలకమండలి సమావేశంలో ఆమోదం పొందితే తిరుమలలో వసతి కష్టాలు మాత్రమే కాకుండా అత్యధిక సదుపాయాలు కలిగిన వసతి గదులను అందించే అవకాశం ఉంది. తిరుమలశ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తువుంటారు.ఇలా తిరుమలకు చేరుకున్న భక్తులకు వసతి సదుపాయం ఎంతో అవసరం. గత ఆరు దశాబ్దాల క్రితం నిర్మాణం చేసిన వసతి గదులు ఈ రోజు కూడా వినియోగంలో ఉన్నాయి. చాలా సార్లు మరమ్మత్తులు నిర్వహించిన స్వల్పకాలికంగా మాత్రమే ఆ గదులు ఉపయోగపడుతున్నాయి. దీంతో సామాన్య భక్తులకు జారీ చేసే వసతి గదులు విషయంలో తిరుమల దేవస్థానం ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది.

ఈ రోజు పరిస్థితులకు తగ్గట్టుగా పాత భవనాల్లో నిర్మాణం చేపట్టాలని కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో దాదాపు 60 సంవత్సరాల క్రితం నిర్మించిన సత్రాలను పూర్తిస్థాయిలో తొలగించి వాటి స్థానంలో నూతన నిర్మాణాలు చేపట్టే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆలోచిస్తుంది. ఆధునిక సౌకర్యాలతో వీటిని నిర్మించేలా ఉన్నత అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం తిరుమల పై దాదాపు 7,500 గదులను భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కేటాయిస్తోంది.వీటిలో 30 నుంచి 60 సంవత్సరాల కిందట నిర్మించిన కట్టడాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాలుగు సంవత్సరాలుగా అనేక కాటేజీలకు కోట్ల వ్యయంతో మరమ్మత్తులను చేస్తున్నారు. అన్నిటిలోనూ గీజర్లు, టైల్స్, లీకేజీలు లేకుండా మరమ్మతులు చేస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో దాదాపు 60 సంవత్సరాల క్రితం నిర్మించిన సుదర్శన్ గోవర్ధన్, కల్యాణి సత్రాలను కూడా దశల వారీగా మరమ్మతులు చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు.

అయితే  ఒకేసారి అన్నింటినీ తొలగిస్తే గదులకు కొరత ఏర్పడే అవకాశమున్న నేపధ్యంలో ఒక్కో సత్రాన్ని కూల్చి వేసి కొత్తవాటిని నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రతి సత్రం లోనూ కార్, ప్కారింగ్, కల్యాణకట్ట, ఏసీ, నాన్ గదులు,గీజర్లు వంటి సదుపాయాలను కల్పించనున్నారు. పాలకమండలిలో చర్చజరిపి త్వరలోనే పనులు ప్రారంభించేలా టీటీడీ అధికారులు ప్రణాళికసిద్ధం చేస్తున్నారట.

ఇది కూడా చదవండి :

ప్రియాంక చోప్రా ప్రీ ఆస్కార్ పార్టీ

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh