గన్నవరంలో చంద్ర బాబు చేసిన కామెంట్లపై ఘాటుగా రియాక్ట్‌ అయ్యన కొడాలి

kodali nani open challenge

గన్నవరంలో  చంద్ర బాబు చేసిన కామెంట్లపై ఘాటుగా  రియాక్ట్‌ అయ్యన  కొడాలి

గన్నవరం వెళ్లి పోలీసు అధికారులను నోటికి వచ్చినట్టుగా తిడుతున్నారని. మాజీ మంత్రి కొడాలి నాని చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాని చంద్రబాబుపై ఘాటు విమర్శించారు. చంద్రబాబు పిచ్చి ఛాలెంజ్‌లకు ముఖ్యమంత్రి జగన్‌ స్పందించరని. చంద్రబాబుకు తామే ఎక్కువని నాని స్పష్టం చేశారు. ‘గన్నవరం వెళ్లి ఒక్కొక్కడి అంతు తేలుస్తా.అని చంద్రబాబు పెద్ద పెద్దగా అరుస్తున్నాడు. మెంటల్‌ ఆస్పత్రి నుంచి తప్పించుకొని ఇక్కడకు వచ్చాడని ప్రజలంతా భయపడుతున్నారు. చంద్రబాబును పిచ్చాస్పత్రిలో గానీ, జైల్లో గానీ పెట్టాల్సిన అవసరం ఉంది. జగన్‌మోహన్‌రెడ్డి రాజ్యాంగ మీద ప్రమాణం చేసి, రాజ్యాంగాన్ని, శాంతిభద్రతలను కాపాడుతాను.  రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇలాంటి పిచ్చి వాళ్లకు ఆయన రియాక్ట్ అవ్వరు’ అని కొడాలి నాని కొనియాడారు. ‘లోకేష్‌ జగన్ మోహన్ ఛాలెంజ్‌లు విసిరితే బ్రెయిన్‌లెస్‌ కిడ్‌ అనుకోవచ్చు. 76 ఏళ్ల వయసులో కొట్టుకుందాం.. పోలీసులు లేకుండా రా. అని ముఖ్యమంత్రికి చంద్రబాబు ఛాలెంజ్‌లు విసురుతున్నారు. చంద్రబాబుకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. బ్లాక్‌ క్యాట్స్‌ వద్దని కేంద్రానికి లేక రాయాలి. నేను, వంశీ ఇద్దరిలో ఒకరం మాకున్న సెక్యూరిటీని వదిలేసి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తాం.. చంద్రబాబు ఎక్కడకు రమ్మంటే అక్కడికి వస్తాం’ అని కొడాలి నాని స్పష్టం చేశారు.

‘నల్లమల ఫారెస్టా..? లేక మచిలీపట్నం వద్ద సముద్రంలో 20 కిలోమీటర్లు వెళ్లిన తరువాత పడవల్లో కొట్టుకుందామా..? ఛత్తీస్‌గడ్, ఒడిశా అడవుల్లో కొట్టుకుందామా..? నీతోపాటు లోకేష్‌ను, ముసలి రౌడీలను కూడా తీసుకురా.. ఒక్క దెబ్బతో దరిద్రం వదిలిపోతుంది. ఒక బ్యాచ్‌ పైకి, మరో బ్యాచ్‌ జైలుకు పోతుంది. రాష్ట్రానికి పట్టిన శని, దరిద్రం విరగడైపోతుంది. చంద్రబాబు మైండు ఉండే మాట్లాడుతున్నాడా అసలు  రెండు మూడేళ్ల నుంచి ఖాళీగా ఉండి బాలకృష్ణ సినిమాలు చూస్తున్నట్టున్నాడు. బాలయ్య చంద్రబాబు మీద పూనినట్టున్నాడు. ఆయన సినిమాల్లో చెబుతుంటే.  చంద్రబాబు మైక్‌ల ముందు డైలాగ్‌లు చెబుతున్నాడు’ అని కొడాలి నాని సెటైర్లు వేశారు.ఇది అంతా ‘రాష్ట్ర ప్రజలుగమణిస్తున్నారు . గన్నవరానికి పట్టాభిని పంపించింది చంద్రబాబే. ఆ ఘటనలో టీడీపీ, వైసీపీ నాయకులు, కార్యకర్తలపై చిన్న గీత కూడా పడలేదు. ఇరు పార్టీలను కంట్రోల్‌ చేసిన పోలీసులకే దెబ్బలు తగిలాయి. సీఐ ఇంకా ఐసీయూలోనే  ఉన్నారు. పోలీసుల భద్రత లేకుండా అడుగు కూడా వేయలేని చంద్రబాబు  ఆ పోలీసులనే నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. 76 ఏళ్ల వయసు వచ్చినా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు’ అని కొడాలి నాని దూషించారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh